ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్నివీర్ అజయ్ కుటుంబానికి పారితోషికం చెల్లించాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 01:31 PM

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్‌ కుటుంబానికి పారితోషికం గురించి భారత సైన్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అజయ్ వీర మరణాంతరం వారి కుటుంబానికి పరిహారం చెల్లించలేదనే ఆరోపణలను ఆర్మీ తోసిపుచ్చింది. అజయ్ కుటుంబానికి ఇప్పటికే రూ.98 లక్షల 39 వేలు చెల్లించినట్లు భారత సైన్యం తెలిపింది."బకాయి ఉన్న మొత్తం సొమ్ములో అగ్నివీర్ అజయ్ కుటుంబానికి ఇప్పటికే రూ. 98.39 లక్షలు చెల్లించాం. అగ్నివీర్ స్కీమ్ నిబంధనలు వర్తించే విధంగా.. పోలీస్ వెరిఫికేషన్ తర్వాత త్వరలో మొత్తం అమౌంట్ సెటిల్ అవుతుంది. రూ.1.65 కోట్లు అజయ్‌కి ఇవ్వాల్సి ఉంది. అగ్నివీర్‌ స్కీంలోని నిబంధనల మేరకు మరో రూ.67 లక్షల వరకు పరిహారం, ఇతర ప్రయోజనాలు, పోలీసు ధ్రువీకరణ అయిపోగానే సెటిల్‌ చేస్తాం. దీంతో మొత్తం రూ.1.65 కోట్లు అవుతుంది" అని ఆర్మీ ఎక్స్‌లో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com