ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర క్యాబినెట్ కమిటీ సభ్యులుగా కింజరాపు రామ్మోహన్ నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 01:30 PM

కేంద్ర క్యాబినెట్ కమిటీల సభ్యులుగా తెలుగు కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డికి అవకాశం దక్కింది. పార్లమెంటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీల్లో సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు నియామకం అయ్యారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కిషన్ రెడ్డికి చోటు దక్కింది. ఇక అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్‌లో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. కేంద్ర క్యాబినెట్‌లో వేర్వేరు కమిటీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ ఎఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ ఎఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ గ్రోత్, క్యాబినెట్ కమిటీ ఆన్ స్కిల్, ఎంప్లాయిమెంట్ అండ్ లైవ్లీహుడ్ కమిటీలను కేంద్రం ఏర్పాటు చేసింది. తెలుగు కేంద్ర మంత్రులకూ అవకాశం దక్కడంతో పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు.. కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com