ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా కళ్లలోకి చూడండి.. మహిళా ఎంపీ వ్యాఖ్యలు, స్పీకర్ రిప్లై.. పాక్ పార్లమెంట్‌లో నవ్వులు

international |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2024, 10:43 PM

పాకిస్థాన్‌ పార్లమెంట్ సమావేశాల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతున్న మహిళా ఎంపీ.. స్పీకర్ తన చూడకపోవడంతో ఒకింత అసహనానికి గురయ్యారు. ఇతరుల కళ్లలోకి సూటిగా చూస్తూ మాట్లాడటం మా పార్టీ నేర్పిందని, నేను మాట్లాడుతుంటే కనీసం నావైపు చూడటం లేదని అన్నారు. దయచేసి నావైపు చూడండి అని ఆమె చేసిన వ్యాఖ్యలకు స్పీకర్ స్పందిస్తూ.. నేను మీ మాటలు వింటాను కానీ, మహిళల కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడటం మర్యాద కాదని అన్నారు. దీంతో సభలోని సభ్యులందరూ గొళ్లున నవ్వారు.


పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ నాయకురాలు, మాజీ మంత్రి జర్తాజ్ గుల్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమయంలో స్పీకర్‌ సర్దార్ అయాజ్ సాధిక్‌ తనపై చూడకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఇతరుల కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం నా పార్టీ నాయకులు నాకు నేర్పించారు... నేను ప్రజల తరపున వచ్చిన ప్రతినిధిని... లక్షన్నర ఓట్లతో ఈ సభలో అడుగుపెట్టాను.. నేను ప్రసంగిస్తున్నప్పుడు మీరు నావైపు చూడకుండా ఉంటే మాట్లాడలేను.. దయచేసి మీరు కళ్లద్దాలు పెట్టుకొని నాపైపు చూడండి’ అని ఆమె స్పీకర్‌ను కోరారు.


దీనికి స్పందించిన స్పీకర్‌.. ‘‘నేను మీ మాటలు వింటాను. కానీ మహిళల కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం సరికాదు.. అందుకే మిమ్మల్ని సూటిగా చూడట్లేదు’ అని అన్నారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించిన జర్తాజ్ గుల్.. మహిళలను సూటిగా చూడకూడదని సభలో 52 శాతం మహిళలను తొలగిస్తే మీరు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే సభలో ఉంటారని కౌంటర్‌ వేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌ అవుతోంది. ‘ఏమా హస్యం.. ’ అని ఒకరు.. ‘ఈ రోజు ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుంటున్నాం’ ఇంకొరు కామెంట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com