ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జలపాతంలో పెరిగిన వరద.. కళ్ల ముందే కొట్టుకుపోయిన కుటుంబం, ఐదుగురు మృతి

national |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2024, 10:40 PM

జలపాతం వద్ద విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం.. అక్కడ ఊహించని విధంగా ప్రాణాలను పోగొట్టుకుంది. జలపాతంలో కొట్టుకుపోయి ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లా లోనావాలా ప్రాంతంలోని ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. భూసీ డ్యామ్‌ బ్యాక్‌వాటర్‌ సమీపంలోని జలపాతంలో మునిగి ఓ మహిళ, ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. జలపాతంలోకి దిగిన బాధితులు.. ప్రవాహ ఉద్ధృతి పెరిగిన విషయం గమనించలేదు. దీంతో ఒక్కసారిగా ప్రవాహం పెరిగి వారు కొట్టుకుపోవడం వీడియోలో రికార్డయ్యింది.


 హడప్సర్‌ ప్రాంతానికి చెందిన అన్సారీ కుటుంబం ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భూసీ డ్యామ్‌ చూసేందుకు వచ్చి అక్కడ జలపాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో ప్రవాహం పెరిగి ఆ ఉద్ధృతికి కొట్టుకుపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికోసం గాలింపు చేపట్టారు. మహిళ, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు ఆదివారం సాయంత్రానికి లభ్యమయ్యాయి. అప్పటికే చీకటి పడటంతో గాలింపు నిలిపివేశారు. సోమవారం ఉదయం తిరిగి గాలింపు కొనసాగించారు.


చివరకు నాలుగేళ్ల బాలుడు, తొమ్మిదేళ్ల బాలిక ఇద్దరి మృతదేహాలు లభించినట్టు పోలీసులు తెలిపారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుణె గ్రామీణ ఎస్పీ పంకజ్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ.. హడప్సర్‌ ప్రాంతానికి చెందిన అన్సారీ కుటుంబం భూసీ డ్యామ్‌కు వచ్చిందని తెలిపారు. అనంతరం పిల్లలతో కలిసి ఆయన భార్య జలపాతంలోకి దిగిందని, భారీ వర్షం కారణంగా ప్రవాహం పెరిగిన సంగతి గమనించలేదని చెప్పారు. ప్రవాహ ఉద్ధృతికి వీరంతా కొట్టుకుపోయారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com