ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయకృష్ణకు స్వాగతం పలికిన నియోజకవర్గం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 07:26 PM

పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు జన నీరాజనం పలికారు. పార్వతీపురం నుంచి పాలకొండ వరకు కార్యకర్తలు, మహిళలు స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గానికి వస్తున్న తరుణంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయోత్సవ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీ పార్వతీపురంలో సాయంత్రం నాలుగు గంటలకు ప్రారం భమై రాత్రి 8.30 గంటలకు పాలకొండకు చేరింది. ర్యాలీ ప్రారంభం నుంచి భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన వెంట వేలాదిగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. వీరఘట్టంకు చేరుకున్న జయకృష్ణకు స్థానిక నాయకులు పూలమాలలు, బొకేలతో సత్కరించారు.  ఏలాం సెంటర్‌ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com