ఒంగోలు జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. కలెక్టరేట్లో గురువారం ఆమె కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన మీకోసం అర్జీలను సకాలంలో సహేతుకంగా పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాల అమలుపైనా దృష్టిపెడతామని తెలిపారు. జిల్లాలో ఉన్న తాగునీరు, ఇతర సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా అవగాహన పెంచుకుంటానని వివరించారు. జిల్లాస్థాయిలోని సమస్యలను వీలైనంతా వరకు స్థానికంగా, మిగతావి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్య, వైద్యం పారిశుధ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాను అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషిచేస్తానని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి తాను 24/7 అందుబాటులో ఉంటానని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే ఫోన్ కూడా చేయవచ్చని తెలిపారు. లేనిపక్షంలో వాట్సాప్, ట్విట్టర్, ఈమెయిల్లో కూడా ఆయా సమస్యలను తన దృష్టికి తెస్తే వాటిని పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని అన్సారియా చెప్పారు.