చేయూత నాలుగో విడత డబ్బులు అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో తక్షణమే జమ చేయాలని ఐద్వా పట్టణ కార్యదర్శి లక్ష్మి, సీఐటీయూ అధ్యక్షుడు జగన్మోహన్ డిమాండ్ చేశారు.ఈమేరకు విజయనగరం లోని 41వ సచివాలయం వద్ద నిరసన తెలిపి, సచివాలయ కార్యదర్శికి వినతిప త్రంఅందజేశారు. ఈసందర్భంగావారు మాట్లాడుతూ గతముఖ్యమంత్రి నాలుగో విడత చేయూత డబ్బులు 18,750 రూపాయలు బటన్ నొక్కినా, ఎన్నికల కోడ్ వల్ల లబ్ధిదారుల ఖాతాలో జమకాలేదని తెలిపారు.తక్షణమే ప్రభుత్వం అర్హులైన వారికి డబ్బులుచెల్లించే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మి, రాజమ్మ, కొండమ్మ, మంగమ్మ, జ్యోతి, సత్యవతి, నారాయణమ్మ పాల్గొన్నారు.