ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్నయ వర్శిటీపై నివేదిక రూపొందిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 07:09 PM

నన్నయ వర్శిటీలో భయంకర దోపిడీ జరిగిందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు.నన్నయ వర్శిటీ అక్ర మాల పుట్టగా తయారైందన్నారు.ఈ భాగోతాన్ని నాలుగు రోజుల్లో మీడియా ముందుంచుతానన్నారు. దీనిపై సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు అం దజేస్తామని తెలిపారు. యూనివర్శిటీ లంచాలమయంగా మారిందన్నారు. మాజీ ఎమ్మెల్యే కీలకమైన విభాగాల్లో తన సొంత మనుషులను పెట్టుకుని నిధులు మళ్లించారని ఆరోపించారు. విద్యార్థుల కట్టిన కోట్లాది రూపాయల ఫీజు పక్కదారి పట్టిందన్నారు. రాజానగరం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో చేసిన పనులకు రూ.216.17 కోట్లు పెండింగ్‌ బిల్లులు ఉన్నాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే అంచనాలు రూపొందించామని తెలిపారు.కూటమి ప్రభుత్వంలో 3 నెలల్లో ఇబ్బందులను అధిగ మించి నియోజకవర్గాలను అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు. గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌, డ్రగ్స్‌ ముఠాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.రియల్‌ ఎస్టేట్‌ దొంగలను వదలమన్నారు.పోలీసులను అడ్డుపెట్టుకుని సాగించిన అక్రమాలు వెలికితీస్తామన్నారు.కోరుకొండ భూముల విషయం సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com