ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. రోడ్డు ప్రమాదాల కారణంగా రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో చట్టనిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది. రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ ధరించకపోవడం వల్ల సంభవించే దుష్ప్రభావాలు, చట్టనిబంధనల గురించి అధికారులతో కలసి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది.
![]() |
![]() |