ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కౌలు వేలంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 07:03 PM

కర్నూలు జిల్లా, రుద్రవరం మండలం పేరూరు గ్రామంలో ఈశ్వర, రామస్వామి, ఆంజనేయస్వామి దేవస్థాన భూముల కౌలు వేలం లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌలుకు సంబంధించి దేవదాయశాఖ అధికారులు మంగళవారం డిపాజిట్లు స్వీకరించారు. అయితే అన్యమతస్తులు బహిరంగ వేలంలో పాల్గొనరాదని చెప్పడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. మాటామాట పెరిగి ఇరువర్గాల వారు దాడులు చేసుకున్నారు. ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తన సిబ్బందితో వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో సమస్య సద్దుమణిగింది. కౌలు వేలం వాయిదా పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com