ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌.. ఏంటీ ప్యాలెస్‌ల పిచ్చి, నీ తాత జాగీరా: మంత్రి నారా లోకేశ్‌ ఫైర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 03:55 PM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో చేసిన భూ కేటాయింపులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వైజాగ్‌లోని రుషికొండ బీచ్ సమీపంలో రూ.500 కోట్లతో అత్యంత రాజభోగాలు ఉన్న ప్యాలెస్‌లు నిర్మించారని తెలుగుదేశం నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల కోసం కేటాయించిన భూమి, నిర్మాణాలు అక్రమమని కూల్చివేయడం, నోటీసులు జారీ చేస్తున్న వేళ.. లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


ఈ సందర్భంగా ట్వీట్ చేసిన నారా లోకేష్.. "జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన రూ. 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే రూ. 500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు. ఏంటీ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?" అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com