కంబదూరు మండల కేంద్రంలో నీటికుంటలో మునిగి 9వ తరగతి విద్యార్థిని ప్రణీత మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసు కుంది. వేసవి సెలవులు కావడంతో తోటి స్నేహితులతో నీటికుంట దగ్గరికెళ్లిన ప్రణీత కాలుజారి నీళ్లలో మునిగినట్లు తెలిసింది. ఈత రాక మృతి చెందినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు సూర్య, అరుణ కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.