ధర్మవరం పట్టణంలోని 37వ వార్డు మాజీ కౌన్సిలర్ వెంకటరెడ్డి, మాజీ సైనికుడు రమణారెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, రామచంద్రనాయుడు, నారాయణస్వామి, ఓబులేసు, సురేశనాయుడు, శ్రీరాములు, కుమార్ తదితరులు జనసేనలోకి చేరారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి సమక్షంలో గురువారం వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారికి చిలకం మధు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతిఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారు.