ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నం పోర్టుకు కోకింగ్‌ కోల్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 02:21 PM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ఆస్ట్రేలియా నుంచి రెండు నౌకల ద్వారా తెప్పించుకున్న కోకింగ్‌ కోల్‌ను అదానీ గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టుకు తరలించారు. ఈ నౌకలు వారం క్రితం అదానీ పోర్టుకు రాగా కార్మికుల ఆందోళన కారణంగా యాజమాన్యం వాటికి బెర్తులు కేటాయించకుండా అలాగే ఉంచేసింది. దాంతో విశాఖ ఉక్కు బొగ్గు కొరత ఎదుర్కొంటోంది. ఆ రెండు నౌకల్లో 1.5 లక్షల టన్నుల బొగ్గు ఉంది. గురువారం విశాఖపట్నం పోర్టుకు చేరిన ఆ నౌకల నుంచి బొగ్గును రోడ్డు మార్గాన స్టీల్‌ప్లాంటుకు తీసుకురానున్నట్టు ఉక్కు పోరాట కమిటీ సభ్యులు వరసాల శ్రీనివాసరావు తెలిపారు. బొగ్గుతో పాటు లైమ్‌ స్టోన్‌ కూడా 50 వేల టన్నులు ఉందన్నారు. ఇదిలావుండగా సెయిల్‌ నుంచి 8 వేల టన్నుల కోకింగ్‌ కోల్‌ తీసుకున్నారని, అందులో 4 వేల టన్నులు ఇప్పటికే రాగా మిగిలిన 4 వేల టన్నులు శుక్రవారం వస్తుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com