రాష్ట్ర రాజకీయాలకు విజయవాడ గుండెకాయ వంటిది. హాట్బెడ్ ఆఫ్ పాలిటిక్స్గా గుర్తింపు వుంది. అలాంటి విజయవాడ పార్లమెంటు సీటు తమ ఖాతాలో ఉండాలని ప్రధాన రాజకీయపార్టీలు తపిస్తుంటాయి. గతంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ బలంగా ఉండేది. టీడీపీ ఆవిర్భావం తర్వాత పరిస్థితి మారింది. దాదాపు 10 సార్లు పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరిగితే అందులో 5 సార్లు టీడీపీ గెలుపొందింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. పైగా వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులెవ్వ రూ జనజీవితంలో లేకుండా మాయమైపోయారు. 2014 లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల అనంతరం క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) సై తం ఓటమి తర్వాత క్రియాశీలక రాజకీయాలకు స్వస్తి చె ప్పారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ టీడీపీకి కంచుకోటలా మారింది. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని 74వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ గెలుపొందారు. 2019లోనూ ఆయనే బరిలో ఉన్నారు. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీస్తున్నా విజయవాడలో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. ఈసారి కేశినేని నాని వైసీపీ తరఫున పోటీ లో ఉండగా ఆయన సోదరుడు కేశినేని చిన్ని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.