నంద్యాల జిల్లా, ఆత్మకూరు పట్టణంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆత్మకూరు నగరంలోని రఘునాథ్ సెంటర్లో ఓ పాత ఇనుప సామాను గోడౌన్లో భారీగా మంటలు వ్యాపించాయి. మంటల్లోనుంచి భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.