సీఎం జగన్ ప్రభుత్వం అవసరం, ఆవశ్యకత ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పెట్టిన వ్యవస్థలు దేశంలో ఎక్కడా లేవన్నారు. జగన్ అమల చేసిన సంస్కరణల వలన రాష్ట్రంలో పేదరికం తగ్గిందని తెలిపారు. విద్యలో కూడా కేరళను అధిగమించామని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ చెప్పిందే చేశారని... చేయలేనివి చెప్పరని అన్నారు. ఆర్ధిక కారణాల వలన సీపీఎస్ చేయలేకపోయామని... సీపీఎస్ కన్నా మెరుగైన పధకం పెట్టామని వెల్లడించారు. 14 ఏళ్ల చరిత్రలో చంద్రబాబు చెప్పింది చేశామని చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ నాయకత్వం చేస్తున్నది నాయకులతో కాదని... ప్రజలతో అని మంత్రి అన్నారు.