గుత్తి పట్టణంలోని కర్నూలు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం అల్పాహారం పంపిణి చేసారు.ముఖ్య అతిధిగా గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ హాజరై మాట్లాడుతూ ఈ రోజు గుత్తి ఆటోయూనియన్ వారు శుభ దినంగా భావించి ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఆటో యూనియన్ అధ్యక్షులు రామాంజి మాట్లాడుతూ ప్రపంచ శాంతి కి అన్ని మతాలు కులాలు లోని ప్రజలు సోదర భావంతో మెలగాలని ఈ రోజు అల్పాహారాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 15 రోజులుగా ఇక్కడ చలివేంద్రం ద్వారా ఎందరిరో దాహర్థి తీరుస్తున్నామని త్వరలో వచ్చే నెలలో ఉచితంగా మజ్జిగ కూడా పంపిణి చేస్తామన్నారు.