ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికుల సమస్యలని తెలుసుకునేందుకు డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 10:57 AM

కాకినాడ డిపోలో గురువారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ ఎంవీ మనోహర్‌తో పలువురు మాట్లాడారు. పెద్దాపురం దర్గాసెంటర్‌, సామర్లకోట బల్ల మార్కెట్‌, విఘ్నేశ్వర టాకీస్‌, మెహర్‌ కాంప్లెక్స్‌ బ్రౌన్‌పేట వద్ద టైమింగ్స్‌ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సామర్లకోట-పిఠాపురం బస్సును పెద్దాపురం వరకు పొడిగించాలని కోరారు. తుని, కాకినాడ బస్సులు ఒకేసారి వరుసగా కలిసిపోతున్నాయని సరిగ్గా ఆపడంలేదని డీఎంకు తెలిపారు. కాకినాడ-జి.మామిడాడ మధ్య బడి బస్సును తిప్పాలని, పిఠాపురం- ఏలేశ్వరం మధ్య బస్సులను పునరుద్ధరించాలని పలువురు కోరారు. వీటిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని డీఎం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com