ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర భవిష్యత్ గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 10:57 AM

ఆత్మకూరు నియోజకవర్గంలో నేటి నుంచి ప్రజాగళం కార్యక్రమం ప్రారంభమవుతుందని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఏఎస్ పేటలో జరగబోయే బహిరంగ సభలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు ఆనం. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రజా దర్భారు భవనం కూల్చివేతతో వైసీపీ పాలన ప్రారంభమైందని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com