ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 09:27 AM

తిరుమల కొండపై భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం వేంకటేశ్వర స్వామిని 65,992 మంది దర్శించుకోగా.. 25,698 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి ఆలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యునిగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన రఘునాథ్ విశ్వనాథ్ దేశ్ పాండే ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వీరితో ప్రమాణం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం జేఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com