ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన నుండి వైసీపీలోకి చేరికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 11:06 AM

వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సమక్షంలో 100 మంది జనసేన నేతలు వైయ‌స్ఆర్‌సీపీలోకి చేరారు. జనసేన పార్టీ నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి జీవన్ కుమార్ నేతృత్వంలో ఆదివారం 100 మంది ఆ పార్టీ కార్యకర్తలకు  వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో కండువా కప్పి విజ‌య‌సాయిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.   మా పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తెలుగుదేశం పార్టీకి కంటగింపుగా ఉంద‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. టిడిపికి వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదు. నెల్లూరు పార్లమెంటుతో పాటు దాని పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను వైయ‌స్ఆర్‌సీపీ  కైవసం చేసుకుంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. జనసేనకి భవిష్యత్తు లేదన్నారు. కులతత్వ, మతతత్వ పార్టీలో ఏపీలో ఒక్కటయ్యాయని ఆయన మండిపడ్డారు. నా ప్రత్యక్ష రాజకీయాలు సొంత జిల్లా నుంచి ప్రారంభిస్తున్నా.. రాష్టంలోని అన్ని జిల్లాలకు రీజినల్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశాను.. పార్టీకి, ప్రజలకు విశేష సేవలు అందించాను. జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరకలేదు.. అందుకే వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడ్ని లాక్కుని టికెట్ ఇచ్చారు. మా పార్టీలో రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందిన నేతలు ఇప్పుడు మాపైనే విమర్శలు చేస్తున్నార‌ని దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com