ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు

Education |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2024, 12:08 PM

తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 10వ తరగతిలో ఫెయిల్ అయి మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించిన 1,02,528 మంది హాజరుకానున్నారు. పరీక్ష సమయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు. రాష్ట్రంలోని మొత్తం 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించడానికి ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్‌లను ముద్రించారు. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
తెలంగాణలో కూడా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుందని.. ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5.05 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆర్టీసీ విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com