ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసు వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తపరిచిన రామకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 12:18 PM

నేడు సీఎం జగన్ కర్నూలు నంద్యాల జిల్లాల పర్యటన నేపథ్యంలో పలువురు స్థానిక సీపీఐ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి రామచంద్రయ్య, కర్నూలు నంద్యాల జిల్లాల కార్యదర్శులు బి గిడ్డయ్య, ఎన్ రంగనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌‌లను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ, అతిగా ప్రవర్తించటం గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నిరంకుశ రాచరిక పాలనలో ఉన్నామా? అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. తక్షణమే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com