ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 12:17 PM

ఆంధ్రప్రదేశ్ గవర్నర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అనారోగ్య కారణంగా మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. అయన  ఆరోగ్య పరిస్థితిపై డా. సుధాకర్ కంటిపూడి మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్, మీడియాకు వివరాలు తెలిపారు. గవర్నర్ తీవ్ర కడుపు నొప్పి కారణంగా మణిపాల్ హాస్పిటల్లో చేరారు. వైద్యపరీక్షల్లో గవర్నర్ అక్యూట్ అపెండిసైటిస్‌తో బాధ పడుతున్నట్లు వైద్యపరీక్షల్లో తేలింది. గవర్నర్‌కి రోబో సాయంతో 'అపెండెక్టమీ' అనే సర్జరీని డాక్టర్లు చేశారు. సర్జరీ విజయవంతం అయినట్లుగా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డా. సుధాకర్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com