టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని విజయవాడకు తరలించే క్రమంలో పోలీసుల కాన్వాయ్ను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారిపై ఆందోళనకారులు టైర్లకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిని తరలిస్తున్న కాన్వాయ్కి అడ్డుగా రోడ్డుపై వాహనాలను పెట్టారు. దీంతో సీఐడీ పోలీసులు రూటు మార్చి చంద్రబాబును విజయవాడకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.