కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... ఒమ్మంగి గ్రామానికి చెందిన గారపాటి మాణిక్యం (66) అనారోగ్యం కారణంగా సైకిల్పై రాచపల్లి ఆసుపత్రికి వెళ్లి తిరిగి ఒమ్మంగి వస్తుండగా రాచపల్లి ఒమ్మంగి మధ్య వెనుక నుంచి వస్తున్న క్రేన్ ఢీ కొంది. ఈ ఘటనలో మాణిక్యం తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.