ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాలకు అతీతంగా వరద బాధితులకు పరిహారం అందించాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 11:20 PM

వరద బాధితులకు కూటమి ప్రభుత్వం మంచి ప్యాకేజీ ఇచ్చిందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. బాధితులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. బ్లూ మీడియా అపోహలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇవాళ(ఆదివారం) ప్రకాశం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా వరద బాధితులకు పరిహారం అందజేశామని స్పష్టం చేశారు. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరద బాధితులకు కోటి రూపాయల పరిహారం అందజేస్తానని చెప్పి ఎవరికి ఇచ్చారో కూడా తెలియదని విమర్శించారు. బోట్లతో ప్రకాశం బ్యారేజీని కూల్చాలని చూశారని ధ్వజమెత్తారు. తాము నిర్మించే వాళ్లమని..... వైసీపీ నేతలు విధ్వంసం చేసేవారని ఆరోపించారు. అందుకే ప్రజలు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నాయకులను ఇంటికి సాగనంపారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com