బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని రైతులకు 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి గాను ఈనెల 24, 25 తేదీలలో పీఎం కిసాన్ పథకం కింద సంబంధించి 13వ విడత నగదు రైతులు ఖాతాల్లో బదిలీ కానున్నట్లు మండల వ్యవసాయ అధికారిణి ఉయ్యూరు లోకేశ్వరి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండో విడత మూడో విడత నుండి నగదు రైతుల ఖాతాల్లో జమ కాని వారు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించాలన్నారు. ఈ సేవ కేంద్రాలలో సమీప రైతు భరోసా కేంద్రాలలో ఈ కేవైసీ చేయించుకొని పీఎం కిసాన్ పథకానికి అర్హులు కాగలరన్నారు. ఫోన్ ద్వారా కొత్తగా పిఎం కిసాన్ నందు రిజిస్టర్ చేయించుకున్న రైతులు వారి యొక్క ఆధార్, పట్టాదారు పాస్ బుక్, 1 బి నకలు దగ్గర్లోని రైతు భరోసా కేంద్రాలలో అందజేసి పిఎం కిసాన్ పథకానికి అర్హులవ్వాలన్నారు. నమోదు చేయించుకోవాల్సిన రైతులు పెండింగ్ లిస్టులో ఉన్న రైతులు రైతు భరోసా కేంద్రాల వద్ద ఏర్పాటుచేసిన జాబితాను పరిశీలించి నమోదు చేయించుకోవాలని ఏ. వో, కోరారు.