టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నేడు తెల్లవారుజామున ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక ఆరోగ్యం బృందం ఆయనకు స్టంట్ వేసి చికిత్సను అందిస్తున్నారు. బీపీ ఎక్కువగా ఉండడంతో ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు బచ్చుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.