ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ కిడ్నీలు మాయం చేశాడో డాక్టర్. ఈ ఘటన బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో జరిగింది. శుభకాంత్ క్లినిక్లో సునీతా దేవి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. అక్కడ ఆమె 2 కిడ్నీలను సీక్రెట్గా డాక్టరు తొలగించాడు. డయాలసిస్ కోసం ఆమె మరో ఆస్ప్రతికి వెళ్లగా కిడ్నీలు లేవని తేలింది. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న డాక్టరు కోసం పోలీసులు గాలిస్తున్నారు.