రాజమహేంద్రవరం లో తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ రణ భేరి కార్యక్రమంలో టీడీపీ నాయకులూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి దిక్కుమాలిన చర్యలు రాష్ట్రం ని సర్వ నాశనం చేస్తుంది. ఉద్యోగ కల్పన అని ఆశ చూపి ఇప్పుడు చేతులెత్తేశారు.అరాచక ఆటవిక విధానం లో రాష్ట్రం పయనిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగ శాతం పెరిగిపోతుంది. విష ప్రచారాలు చేయడం లో మాత్రం ఈ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి మరియు అనుచర గణం ముందు వరుస లో ఉన్నారు అని ఎద్దేవా చేసారు .