ప్రియుడితో ఎఫైర్ పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను కరెంట్ షాక్ పెట్టి చంపేసింది. యూపీలోని మధుర జిల్లా సేల్ఖేడా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మాన్వేంద్ర అనే యువకుడు పెళ్లైన కొన్నాళ్లకే కరెంట్ షాక్తో మరణించాడు. ఇటీవల 'నువ్వు చెప్పినట్లే కరెంట్ షాక్ పెట్టి భర్తను చంపేశా' అని ప్రియుడితో మాన్వేంద్ర భార్య మాట్లాడిన కాల్ రికార్డింగ్ బయటపడింది. నిందితురాలితో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.