ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురంధేశ్వరి కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 07, 2024, 07:04 PM

ఏపీలో టీడీపీ, బీజేపీ పార్టీలకు వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి చురకలంటించారు. బీజేపీ పురంధేశ్వరి కావాలనే సోము వీర్రాజును పక్కనబెట్టారు. అలాగే, ఎల్లో మీడియా పెద్దలు ఓటమి భయంతో రాత్రి పూట నిద్రపోవడంలేదని ఎద్దేవా చేశారు.  ఈ మేర‌కు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘ఏమాటకామాట! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు మాటకు కనీస విలువ ఇవ్వడం లేదంట. ఆయన హయాంలో రాజమండ్రిలో నిర్మించిన పార్టీ ఆఫీసును వదిలేసి ఆమె సొంత ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం, సొంత మనుషుల ద్వారా ప్రచారం నిర్వహించడం మొదటి నుంచి పార్టీలో ఉన్న కేడర్‌ను నమ్మకుండా అవమానించడమేనని అంటున్నారు అంటూ విజ‌య‌సాయిరెడ్డి త‌న ఎక్స్‌(ట్విట్ట‌ర్‌)ఖాతాలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com