దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,664 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి 35 మంది చనిపోయారు. మహమ్మారి నుంచి 4,555 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 47,922గా ఉంది. దేశంలో 14,84,216 మంది శనివారం కరోనా టీకాలు పొందారు.