జుక్కల్ సెగ్మెంట్ పెద్దకొడప్గల్ మండలంలో భారీ వర్షాలకు మొక్కజొన్న, సోయా, కంది, పత్తి, తదితర పంటలు నీట మునిగిపోయాయని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం రైతులు అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు పై రాస్తారోకో చేపట్టారు.
ప్రభుత్వం ఆదుకోకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడమే మార్గం అన్నారు. అప్పు చేసి పంట వేస్తే పూర్తిగా పంటపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.