కన్నెపల్లి మండలంలోని చింతపూడి, లింగాల గ్రామం నుండి నాగారం వెళ్లే ప్రధాన రహదారి అకాల వర్షాలకు రోడ్డు పక్కకు వరద నీరు చేరి రోడ్డు పై కాలువ ఏర్పడి గుంతగా తయారైంది. అటుగా పనుల నిమిత్తం వెళ్తున్న చింతపూడి, లింగాల గ్రామస్థులు రోడ్డు పై ఉన్న గుంతను గమనించి మరమ్మతులు చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ తుమ్మిడి దామోదర్, కాటేల సుధాకర్, భాస్కర్, హన్మంతు, సంతోష్, యువకులు ఉన్నారు.