శుక్రవారం ఉదయం పెద్దపల్లి పట్టణంలోని 14 వ వార్డు, 22వ వార్డులో కమిషనర్ వార్డు కౌన్సిలర్లతో కలిసి వార్డుల్లో పర్యటించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దయచేసి ప్రతిఒక్కరు ప్రతిరోజు మీఇంట్లో వెళ్లే తడి పొడి చెత్తను వేరుచేసి విజిల్ వేస్తూ వచ్చే మా మున్సిపల్ సిబ్బందికి అందచేయాలని అలాగే విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మీ ఇంటి చుట్టుపక్కల వర్షపు నీరు, పిచ్చిమొక్కలు ఉండకుండా చూడాలని అన్నారు డ్రై డే ఫ్రై డే సందర్భంగా వార్డులో అవగాహన చేయుటకు మీవద్దకు వచ్చే వార్డు ఆఫీసర్, మెప్మా ఆర్పీలకు, ఆశ వర్కర్లకు సహకరించలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షాహీధ సబీర్ ఖాన్ ,ఉప్పు స్వరూప రాజు,వార్డు ఆఫీసర్లు దీలిప్, శ్రీనివాస్,సానిటరీ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్ రెడ్డి,పులిపాక రాజు,జవాన్లు శ్రావణ్,చిన్న,కరుణాకర్,వేణు,మెప్మా ఏ డీ ఎమ్ సి మౌనిక,ఆర్పీలు వనజ,సరిత,ఓబీలు పాల్గొన్నారు.