వివిధ బ్యాంకులలో రైతులు తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన తీర్చుతుండడంతో వెంటనే బ్యాంకారులు రైతులకు మళ్ళీ రుణాలు ఇవ్వాలని టిపిసిసి అధికార ప్రతినిధి కల్లుగీత కార్మిక డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ నాగరాజ్ గౌడ్ అన్నారు. వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గం ఆత్మకూర్ మండల కేంద్రంలో ఉన్న ఎస్బిఐ డిసిసిబి బ్యాంకులను మంగళవారం ఆయన సందర్శించి మేనేజర్లతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.