ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు బండారి అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం అదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న చలోఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. చలోఢిల్లీ కార్యక్రమంలో మాదిగ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు