హైదరాబాద్ జంట నగరాలకు, జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు జల మండలి ఆధ్వర్యంలో పుట్టంగండి జీరో పాయింట్ వద్ద నీటిని ఎత్తి పోసేందుకు గత ఏప్రిల్ 17న ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ మోటర్లను తొలగించే ప్రక్రియ పూర్తయినట్టు సోమవారం అధికారులు తెలిపారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయానికి నీటి ప్రవాహం మొదలవడంతో నీటిమట్టం 511 అడుగులు దాటిందని, ఇక ఎమర్జెన్సీ మోటార్ల అవసరం లేదని అధికారులు తెలిపారు.