నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి హెచ్చరించారు. శనివారం రాత్రి నల్లగొండ పట్టణ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేయడంతో పాటుగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.