ఖమ్మం రూరల్ పరిధిలోని వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలో ఏలాంటి పత్రాలు బిల్లులు లేకుండా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 42. 86, 290 లక్షల రూపాయలు శనివారం సీజ్ చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. లోకసభ సాదారణ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో తనిఖీలో వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో నగదు సీజ్ చేశారు.