కారేపల్లి మండల పరిధిలోని పేరు పల్లి గ్రామంలో ఈనెల 22వ తారీకు నుండి ప్రారంభమైన గురువమ్మ తల్లి జాతర నేడు ఆదివారంతో ముగియనుంది. గురుమ్మతల్లి జాతరకు గతంలో కంటే ఈ ఏడాది భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని పూజించుకున్నారు. మొక్కిన మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఆదివారం అమ్మవారికి గ్రామస్తులు బోనాలు సమర్పిస్తారు. దీంతో ఏడాది జాతర ముగుస్తుంది.