ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా ప్రత్యేక సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2023, 12:25 PM

బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌తో కేంద్ర మంత్రి అమిత్‌ షా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ....తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చెయ్యాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.  పోలింగ్‌ బూత్‌ కమిటీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేతలను కోరారు. వచ్చేనెల 2వ తేదీ వరకు పోలింగ్‌ బూత్‌ స్వశక్తీకరణ్‌ చేయాలని సూచించారు.  పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. నిజాం వ్యతిరేక పోరాట చరిత్రను కాంగ్రెస్‌ సమాధి చేసిందని, కాంగ్రెస్‌ బాటలోనే  బీఆర్‌ఎస్‌ నడుస్తుందని దుయ్యబట్టారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com