కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో దాని మిత్రపక్షమైన బీఆర్ఎ్సను ఓడించాలని ప్రజలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆదివారం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభకు రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు చరిత్రలో భాగం కాదని చరిత్ర సృష్టించినవారని స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ, భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర ఏంటో చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. సాయుధ పోరాటంలో ఒక్కశాతం వాటా లేని బీజేపీ విమోచన దినోత్సవాలు జరుపడం సిగ్గుచేటని అన్నారు.