ఈ నెల 16వ తేదీన ఐటీ ఉద్యోగాల కోసం జరిగే ఇంటర్వ్యూస్ ని కోరుట్ల నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు డా. కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మొట్టమొదటిసారిగా ఒక నియోజకవర్గ కేంద్రానికి ఐటీ కంపెనీ రావడం మన ప్రాంత యువత అదృష్టం అని మన నియోజకవర్గంలో స్థాపించబడుతున్న వివిఫై ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కోరుట్ల పట్టణంలో త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నమనీ ఈ అవకాశాన్ని కోరుట్ల నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అన్నారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.