పెద్దపల్లి పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డ్ ఏర్పాటు కోసం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు 20 శాతం వాటా కేటాయించి ప్రతి నెలా పెన్షన్ మంజూరు చేయాలని, ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని కోరారు. ఉద్యమకారులకు హెల్త్ కార్డులు, నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, దళిత బంధులో, డబుల్ బెడ్ రూమ్ లలో ఉద్యమకారులకు ప్రత్యేక కోటా కేటాయించాలని ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా ఉద్యమకారుల బంధు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల గటయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం, పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ బత్తుల శంకర్, గుడిసె గట్టయ్య యాదవ్, పెద్దపల్లి మండల అధ్యక్షులు కాలువల తిరుపతి, మంథని మండల అధ్యక్షులు గోగుల రాజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మంతని విజయ్ కుమార్, జిల్లా నాయకులు కాలువల శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు కాటారి సుధాకర్ రెడ్డి, జంగం కొమురయ్య యాదవ్, పెంచాల మల్లయ్య గౌడ్, జిల్లా సలహాదారులు బురుగు శంకర్ గౌడ్, జిల్లా కార్యదర్శి చింతకుంట వెంకటరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బహుత్ కిషోర్, జిల్లా నాయకులు గొర్ల రమేష్, గుర్రం దేవేందర్, జాడి జంపయ్య, నాగుల కృష్ణ పాల్గొన్నారు.