ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటి ఉద్యోగులను సద్వినియోగం చేసుకోవాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 03:28 PM

ఐటీ ఉద్యోగులను కోరుట్ల నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఈసందర్భంగా మంగళవారం మెట్ పల్లి పటణం లోని బి ఆర్ ఎస్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన ఐటీ ఉద్యోగాల కోసం జరిగే ఇంటర్వును, ఐటీ ఉద్యోగులను కోరుట్ల నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సహకారంతో మొట్టమొదటిసారిగా నియోజకవర్గ కేంద్రానికి ఐటీ కంపెనీ రావడం మన ప్రాంత యువత సహకారమన్నారు. వివిపై ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపనీ కోరుట్ల పట్టణంలో త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మెట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరుద్యోగ యువతకు ఇంటర్వు లు నిర్వహించగా కోరుట్ల పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మెట్‌పల్లి పట్టణ క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వు అవకాశాన్ని కోరుట్ల నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సంజయ్ పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాణావేనీ సుజాత, మెట్ పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి, ఇబ్రహింపట్నం మండల అధ్యక్షుడు ఎలాల ధశరథ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు, మెట్ పల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు నల్ల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com