ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసిరాసి జాట్లు, జిలేబీ.. ట్రెండింగ్‌లో స్వీటు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 09:28 PM

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్‌కు మింగుడుపడని ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌కు విజయమని ఢంకా బజాయించాయి. ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పలేదు. కానీ, వాస్తవ ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఒడిసిపట్టింది. ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల ప్రచారంలో జాట్లు, జిలేబీ పదం ప్రధానంగా వినిపించింది. ఈ రెండింటిపై కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకున్నా.. ఓట్లు మాత్రం కురిపించలేకపోయాయి. జిలేబీ పేరు చెప్పగానే హర్యానా.గోహనా గుర్తుకొస్తుంది. ఆ జిలేబీ గురించి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఈ స్వీట్‌ను పెద్దఎత్తున తయారు చేసి ఎగుమతి చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను బీజేపీ కూడా ఎగతాళి చేసింది.


కాగా, కౌంటింగ్ మొదలవడానికి ముందే ఢిల్లీలోని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు గెలుపు సంబరాలు చేసుకుని, జిలేబీలు తినిపించుకున్నారు. లెక్కింపు మొదలైన తర్వాత కాంగ్రెస్ 60 స్థానాలకుపైగా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. రౌండ్ రౌండ్‌కు ఫలితం మారుతూ.. బీజేపీ ముందంజలోకి వచ్చింది. చివరకు స్పష్టమైన మెజార్టీ సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి సంబరాలు చేసుకుంటోంది.


బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుపుకోడానికి జిలేబీలను ఆర్డర్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జిలేబీ ఆర్డర్ చేసి కాంగ్రెస్, రాహుల్ గాంధీకి బీజేపీ పంపిన స్పష్టమైన రాజకీయ సందేశం పంపింది. గోహనాలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. మథురామ్ గుప్తా వంటి వారు తాము తయారుచేసే జిలేబీలను దేశవ్యాప్తంగా విక్రయించి, ఎగుమతి చేయాలని, దీని వల్ల మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.


దీని వల్ల కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుందని రాహుల్ గాంధీ చెప్పారు. నోట్ల రద్దు వల్ల మథురామ్ వంటివారి వ్యాపారాలు నష్టపోయానని పరోక్షంగా మోదీపై విమర్శలు చేశాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ.. జిలేబీ ఎలా తయారుచేసి, విక్రయిస్తారో రాహుల్ గాంధీకి తెలియదని ఎద్దేవా చేసింది. ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రదాని నరేంద్ర మోదీ ప్రసంగంలోనే గోహానా జిలేబీ ప్రస్తావన రావడం గమనార్హం.


ఇండియా కూటమిపై విరుచుకుపడిన మోదీ.. వారు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రుల ఉండాలనే ఫార్ములాతో ఉందని అన్నారు. ప్రధాని పదవి అంటే మథు రామ్ జిలేబీ అనుకుంటున్నారా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక, ప్రఖ్యాత గాంచిన గోహానా జిలేబీని 1958లో దివంగత మథురామ్ ప్రారంభించారు. ఆ వ్యాపారాన్ని ఆయన మనవలు రామన్ గుప్తా, నీరజ్ గుప్తాలు కొనసాగిస్తున్నారు. స్వచ్ఛమైన దేశీ ఆవు నేతితో తయారుచేసే ఒక్కో జిలేబీ 250 గ్రాములు ఉంటుంది. కిలో రూ.320ల ధర ఉండే ఈ స్వీట్ వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com